నాగర్ కర్నూల్ జిల్లా: నల్లమల అడవిలో మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, నల్లమల అడవి ప్రాంతంలోని దోమలపెంట రేంజ్ కొల్లం పెంట, కొమ్మనపెంట, పల్లె బైలు, నక్కర్ల పెంట ప్రాంతాలలో సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగి అడవి దగ్ధమైంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని సహక చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.









