చెన్నైలోని క్రోమ్పేటకు చెందిన 19 ఏళ్ల జగదీశ్వరన్ 2022లో 12వ తరగతి పూర్తి చేశాడు. అనంతరం నీట్కు శిక్షణ తీసుకున్నాడు. రెండు ప్రయత్నాల్లో విఫలమయిన జగదీశ్వరన్.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఇంట్లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. జగదీశ్వరన్ గదిలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే జగదీశ్వరన్ తండ్రి సెల్వశేఖర్ మాత్రం తన కుమారుడి మరణానికి నీట్ నిర్వహణ కారణమని ఆరోపించారు. గుండె నొప్పికి తోడు కుమారుడి మృతిని తట్టుకోలేక సెల్వశేఖర్ రెండు రోజుల తర్వాత సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులో నీట్ను తొలగించినందుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సెల్వశేఖర్ చనిపోయే ముందు చెప్పారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు.
