AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గద్దర్‌కు సీఎం కేసీఆర్ నివాళి..

ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతికకాయం అల్వాల్‌లోని భూదేవినగర్‌లో సొంత నివాసానికి చేరుకుంది. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దర్‌కు నివాళులర్పించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించారు. కాసేపట్లో మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. అంతకముందు 6 గంటల పాటు భాగ్యనగరంలో 17 కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కళాకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కళాకారులు గద్దర్‌కు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10