కార్మికుల విషయంలో మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రైతు బీమా తరహాలో కార్మిక బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకంలో సాధారణ మరణానికి ఇస్తున్న లక్షన్నర బీమా మొత్తాన్ని మూడు లక్షలకు పెంచనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు.. కార్మికుడి కార్డు రెన్యూవల్ పదేళ్లకు పెంచనున్నట్టు పేర్కొన్నారు. ప్రతీ కార్మికుడి డిజిటల్ కార్డుకయ్యే ఖర్చు బాధ్యత అంత తనదేనని చెప్పుకొచ్చారు. 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందించనున్నట్టు తెలిపారు. సిద్దిపేటలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు.. ఈ మేరకు ప్రకటన చేశారు. సిద్దిపేట పట్టణంలో కార్మిక భవన్కు ఎకరం స్థలాన్ని హరీశ్ రావు కేటాయించారు.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు బీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో రైతుబందు పొందున్న ఏ అన్నదాత.. ఎలాంటి కారణం చేత మరణించినా.. వాళ్ల కుటుంబానికి పెద్ద కర్మలోపు బీమా డబ్బులను దశలవారీగా అందజేసేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈవిధంగానే.. కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.









