ఉన్నత చదువులు చదివేందుకు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి అక్కడ ఆకలితో ఆలమటిస్తోంది. షికాగో వీధుల్లో ఆకలి కేకలు పెడుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను స్వదేశం తీసుకురావాలని అభ్యర్థిస్తూ.. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్కు లెటర్ రాశారు. ఈ లెటర్ను అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖలీకర్ రెహమాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి డెట్రాయిట్లోని TRINE విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత జైదీ తరుచూ తన సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ రెండు నెలలుగా కూతురు జైదీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావటం లేదు. అమెరికాలో తెలిసినా వారికి కాల్ చేసినా స్పందన లేకుండా పోయింది. అయితే ఇటీవల హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు ఆమెను గుర్తించారు. ఆమె వస్తువులను ఎవరో దొంగలించారని.. దీంతో జైదీ చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని తల్లికి సమాచారం అందించారు. జైదీ డిప్రెషన్తో పోరాడుతుందని తల్లికి తెలిపారు. దీంతో ఎలాగైనా తన కూతురుని స్వదేశానికి తీసుకొచ్చేందుకు తల్లి ఫాతిమా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్కు లేఖ రాశారు.









