బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇంట సంతోషం వెల్లివెరిసింది. ఆమె ఇంట త్వరలో బుల్లి రనౌత్ అడుగుపెట్టనుంది. ఈక్రమంలో తాజాగా రీతూ సీమంతం వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఇదిలా ఉంటే.. కంగనా సోదరుడు అక్షత్- రీతూ దంపతులు త్వరలో అమ్మానాన్నలు కాబోతున్నారు. సీమంత వేడుకను పురస్కరించుకుని తన వదినకు బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చింది కంగన. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి.









