AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం

వెంటిలేటర్‌పైనే చికిత్స
హైదరాబాద్‌: పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు నిమ్స్‌ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రీతికి వెంటిలేటర్‌పైనే నిమ్స్‌ వైద్యులు చికిత్స అందిజేస్తున్నారు. ఈరోజు ప్రీతి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. నిమ్స్‌ వైద్యురాలు పద్మజ నిన్న రాత్రి అన్ని టెస్ట్‌ రిపోర్ట్స్‌ పరిశీలించారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి లో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధింపులకు గురిచేశాడు. దీంతో ప్రీతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ)లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఏఆర్‌సీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్ష న్‌ లు ఆమె శరీరంలో ఉన్న అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్యచికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అక్కడే ఆనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. మరోవైపు ప్రీతి ర్యాగింగ్‌ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు.

ANN TOP 10