
చరిత్రలో నిలిచిపోయే ఘట్టం
తెలంగాణ అమలవీరుల త్యాగాలకు చిహ్నంగా నగర నడిబొడ్డున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరజ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభించి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. అమరవీరులకు ప్రజలందరితో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల కుటుంబాలకు వేదికపై సన్మానం నిర్వహించారు. ఈ క్రమంలో.. ఆ కుటుంబాలు కేసీఆర్ను హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబాలు కార్చిన కన్నీటి చుక్కల సాక్షిగా ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోయింది.










