ముంబయి: మహారాష్ట్రలో ఇద్దరు తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెను ప్రమాదం తప్పింది. ఎంఎల్ఎలు ప్రయాణిస్తున్న వాహనానికి పశువు అడ్డువచ్చింది. పశువు తప్పించబోయి ఎంఎల్ఎ జోగు రామన్న వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో వాహనంలో జోగురామన్న, ఎమ్మెల్యే కోనేరు కోనప్న, మాజీ ఎంపి నగేష్లు ఉన్నారు. నాగ్పూర్ వెళ్తుండగా పాండ్రా, కొడబోరీ మధ్య ఎంఎల్ఎల వాహనానికి ప్రమాదం జరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కావకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.









