AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

22 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు..

హైదరాబాద్‌ జంట నగరాల మధ్య సేవలందించే పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను నాలుగు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో లింగంపల్లి- హైదరాబాద్‌; హైదరాబాద్‌-లింగంపల్లి మధ్య 10 రైళ్లు; ఈ నెల 14-17 తేదీల్లో ఉందానగర్‌-లింగంపల్లి; లింగంపల్లి-ఫలక్‌నుమా; రామచంద్రాపురం-ఫలక్‌నుమా రూట్లలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ANN TOP 10