AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏలూరులో దారుణం: మహిళపై యాసిడ్‌ దాడి

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పట్టణంలో మంగళవారం రాత్రి మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళపై యాసిడ్ విసరి పరారయ్యారు. పట్టణ శివార్లలోని బాధితురాలు యడ్ల ప్రచారిక ఇంటి సమీపంలో ఈ సంఘటన జరిగింది.

ఆమె ఇంటికి తిరిగివస్తుండగా బైక్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ విసిరి పరారైనట్లు ఏలూరు ఎస్‌పి డి మేరీ ప్రశాంతి బుధవారం తెలిపారు. వెంటనే బాధితురాలి ఇంటికి చేరుకోగా ఆమె తల్లిదండ్రులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందచేసినట్లు ఎస్‌పి తెలిపారు.

బాధితురాలి మొహంపై యాసిడ్ పడడంతో ఆమె కళ్లు దెబ్బతిన్నాయని ఎస్‌పి చెప్పారు. స్థానిక డాక్టర్ల సూచనతో వెంటనే ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌పి చెప్పారు. బాధితురాలి ఎడమ కన్నుకు ఎటువంటి ప్రమాదం లేదని, కాని కుడి కన్ను 60 శాతం దెబ్బతినడంతో సర్జరీ అవసరమవుతుందని ఆమె తెలిపారు. శరీరంలోని ఇతర భాగాలకు పెద్దగా నష్టం జరగలేదని ఆమె తెలిపారు. మెరుగైన వైద్య అందచేయడానికి బాధితురాలిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మార్చాలని యోచిస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు.

ANN TOP 10