భారీగా నకిలీ విత్తనాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ విత్తనాల సరఫరా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 95 లక్షల విలువైన 3.38 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్, మేడ్చల్, చేవెళ్లలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. నకిలీ విత్తనాలును తరలిస్తున్న 14 మందిని అరెస్ట్ చేసి 14850 ఖాళీ పత్తి విత్తనాల బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తన మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని సిపి స్టీవెన్ రవీంద్ర తెలిపారు.









