AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు

ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆరు వారాల బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ వదిలి వెళ్లరాదని షరతులు విధించింది. గురువారం తిహార్ జైలు బాత్రూమ్‌లో సత్యేంద్ర జైన్ ఒక్కసారిగా జారిపడ్డారు. ప్రస్తుతం ఆయనకు లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్‌జేపీ) ఆస్పత్రి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. వారం రోజుల్లో ఆయన రెండుసార్లు.. అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మూడు రోజుల కిందట కూడా ఆయన జైలు బాత్రూమ్‌లో జారిపడి వెన్నుముకకు గాయకావడంతో సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక, సత్యేంద్ర జైన్ బాత్రూమ్‌లో కాలుజారి కిందపడటంతో స్వల్పంగా గాయపడిన ఆయనను.. చికిత్స కోసం దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో తీసుకెళ్లారు. ప్రస్తుతం సత్యేందర్ జైన్‌ ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. గతేడాది మనీల్యాండరింగ్ కేసులో గతేడాది మేలో అరెస్టయిన సత్యంద్ర జైన్ తిహార్ జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10