AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందరూ చూస్తుండగానే రాళ్లతో కొట్టి…

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇందారం గ్రామంలో గ్రామస్థులు చూస్తుండగానే హత్య చేశారు. చుట్టూ పక్కల జనం చూస్తుండగానే ఓ యువకుడిని బండరాయితో కొట్టి హత్య చేశారు. ఓ వివాహితకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు చేస్తున్నాడని యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారు. స్థానికులు ఈ హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10