హైదరాబాద్ భూముల ధరలు మరోమారు రికార్డును తిరగరాశాయి. తాజాగా రాయదుర్గం ప్రాంతంలో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లు పలికింది. రాయదుర్గం పరిధిలోని పాన్మక్తాలో సర్వే నంబర్ 83/1 (Plot No.1)లోని 5.25 ఎకరాల భూమికి వేలం వేయగా.. ఈ ధర వచ్చింది. ఎకరాకి రూ.264 కోట్ల చొప్పున లెక్కగడితే మెుత్తం భూమి ఏకంగా రూ.1,386 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.
రాయదుర్గంలోని ఈ అత్యంత విలువైన స్థలాన్ని ‘ఎంఎస్ఎన్ రియల్టీస్’ సంస్థ దక్కించుకుంది. ఈ భూమిని తగ్గించుకునేందుకు వేలంలో ఎంతో మంది పోటీ పడగా.. చివరకు అధిక ధర చెల్లించి ఈ సంస్థ సొంతం చేసుకోవడం గమనార్హం. రాయదుర్గంలోని భూములకు ఈ స్థాయి ధర లభించడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు








