AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతిపై మీ స్టాండ్ ఏంటి..? జగన్‌కు మంత్రి లోకేశ్ సూటి ప్రశ్న..!

అమరావతి రాజధాని అంశంపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. “ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా నినాదం. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అమరావతి పై మీ స్టాండ్ ఏంటి జే టర్న్ జగన్ గారూ?” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన సవాల్ విసిరారు. రాజధానిపై తమ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూనే, జగన్ ను లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.

 

మరోవైపు, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేశ్ ట్వీట్ చేశారు.

 

“తెలుగువారి ఆత్మగౌరవం కోసం, అణగారిన వర్గాలకు అండగా మన తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలైంది. తెలుగుదేశం కుటుంబ సభ్యులమైన మనకు ఇది గర్వకారణమైన సందర్భం. ఆవిర్భావ స్ఫూర్తి, ఐకమత్యం చాటే సమయం ఇది. ఇది ఒక చిత్రం కాదు… రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమ, సకల శుభాల గెలుపుకు సంకేతమైన పసుపు జెండా ప్రస్థానం. మీ సోషల్ మీడియా ఖాతాలలో డీపీని పెట్టి, మీ ఇంటిపై పార్టీ జెండా ఎగరేసి ‘నేను తెలుగు వాడిని… నాది తెలుగుదేశం పార్టీ’ అని గర్వంగా చాటండి” అంటూ లోకేశ్ పిలుపునిచ్చారు.

ANN TOP 10