ముఖ్యులు మాత్రమే హాజరు
సంబరాల్లో అభిమానులు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
నటుడు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్దీ మంది సన్నిహితుల మధ్య వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. వీరినిశ్చితార్థంపై నిజమేనా..? అంటూ నెట్టింటా జోరుగా ప్రచారం జరిగింది. నాగార్జున ఫొటోలు షేర్ చేయడంతో వార్త నిజమేనని అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
చైతూ–శోభిత డేటింగ్!
2017లో నటి సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. అప్పటినుంచే చైతూ–శోభిత జంటపై రూమర్స్ వచ్చాయ్. ఇద్దరు లవ్లో పడ్డారని, డేటింగ్ చేస్తున్నట్టు కూడా చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేష¯Œ పిక్స్ బయటికి కూడా వచ్చాయి. ఇప్పడు వారిద్దరూ ఒక్కటయ్యారు.
తేనాలికి చెందిన శోభితా..
ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన శోభితా.. ముంబై యూనివర్సిటీ, హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తిచేశారు. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకున్నారు. అనంతరం సినీరంగంలోకి ప్రవేశించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో నటించింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢాచారి, మేజర్ సినిమాల్లో కనిపించింది. ఇక పొన్నియన్ సెల్వన్, ది నైట్ మేనేజర్ 2, కురుప్ కీలక పాత్రలు పోషించారు.