(అమ్మన్యూస్, అమరావతి):
ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తనయుడు భార్గవ్ పరార్ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి కన్నా తానే ఎక్కువ అని ఫీల్ అయి నిర్ణయాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న అతని తనయుడు సజ్జల భార్గవ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లు వస్తున్నాయి. నిన్న జగన్ మోహన్ రెడ్డి జరిపిన సమావేశానికి గైర్హాజరు అయ్యారు. ఫోన్లు స్విచాఫ్ వస్తుండడంతో హ్తె కమాండ్ ఆరా తీస్తోంది.
రామకృష్ణారెడ్డి వల్లే ఓడిపోయామని ఎమ్మెల్యేలు గగ్గోలు
తమను ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని గంటలు గంటలు ఆఫీసుల్లో కూర్చోబెట్టి పంపించేవారని సజ్జలు వల్లే తాము ఈ స్థితిలో ఉన్నామని జగన్ ముందు చెప్పి వాపోయారు. ఆయన చేసిన నిర్వాకం వల్ల సోషల్ మీడియాలో చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయల్లో ఆగిపోయాయని అన్నారు. కొన్ని ఆర్థికపరమైన విషయాలు కూడా సజ్జలతో ముడిపడి ఉండటంతో అతనిని వెతికే పనిలో ఉంది హై కమాండ్. సజ్జల ప్రెస్ మీట్ పెడతారా లేదా..అనే అంశం పై..వైసీపీ నాయకుల్లో చర్చ మొదలైంది.









