ఇంకా పదేళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టీకరణ
(అమ్మన్యూస్, అమరావతి):
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరో బాంబు పేల్చారు. ఏపీకి కాబోయే సీఎం ఎవరనే విషయం చెప్పారు. మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారని అన్నారు. వేణు స్వామి గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యరాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.
2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని వేణు స్వామి చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించలేరని ఆయన తెలిపారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ… ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని.. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటుంటే మీరు… మీళ్లీ జగనే సీఎం అని అంటున్నారని ప్రశ్నించారు. నేను రోజుకో మాట మాట్లాడానికి రాజకీయ విశ్లేషకుడిని కాదని.. జ్యోతిష్యుడనని ఒక్కసారి చెప్పిన మాట మీదే తాను నిలబడతానని ఆయన వేణు స్వామి తెలిపారు.
టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందని వేణు స్వామి వ్యాఖ్యనించారు. సర్వేలు, అందరూ ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని.. కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరెన్ని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. జాతకరీత్యా జగన్ మళ్లీ సీఎం అవుతారని.. చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరని వేణు స్వామి తేల్చి చెప్పారు. జగన్ జాతకంలో బుధ మహర్దశ ప్రవేశించిందని.. మరో 17 ఏళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏదీ లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024, 2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి తెలిపారు.









