AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌ ఆర్టీసీకి 23 గంటల్లోనే పెద్దఎత్తున ఆదాయం

లోక్‌సభ ఎన్నికలు టీఎస్‌ ఆర్టీసీకి (TSRTC) భారీగా ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో 3,500 పైచిలుకు బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడిపించింది. తెలంగాణలో సుమారు 1,500 బస్సులు, ఆంధ్రపదేశ్‌కు దాదాపు వెయ్యికి పైగా బస్సులను తిప్పింది. జేబీఎస్​, ఎంబీబీఎస్​ వంటి ప్రధాన బస్టాండ్​లతో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, మియాపూర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించింది. దీంతో రవాణా సంస్థకు 23 గంటల్లోనే పెద్దఎత్తున ఆదాయం సమకూరింది.

పోలింగ్‌ రోజైన ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. తద్వారా సంస్థకి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక ఎన్నికల తెల్లారి (14వ తేదీన) 54 లక్షల మంది ప్రయాణించారు.

ANN TOP 10