AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మౌనమేల కేసీఆర్?.. కవిత అరెస్ట్‌పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్
తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదు
పదేళ్లు మా ప్రభుత్వమే
ఎంపీ ఎన్నికలు మాకు రిఫరెండం

అమ్మన్యూస్, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనకు వచ్చి రేపటితో 100 రోజులు పూర్తి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. గత సర్కార్ రాష్ట్రాన్ని నిండముంచిందని విమర్శించారు. పదేళ్లలో 100 సంవత్సరాలకు సరిపడా విద్వాసం చేశారని మండిపడ్డారు. మిగిలిన గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని, మొన్ననే ఇందిరమ్మ ఇండ్ల స్కీం లాంచ్ చేశామని వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని గుర్తు చేశారు. మా పాలన సంపూర్ణ సంతృప్తిని ఇచ్చిందన్నారు. 8 లక్షల మంది మహిళలకు ఇప్పటికే రూ. 500 లకు సిలిండర్ ఇచ్చామన్నారు. 200 యూనిట్ విద్యుత్.. 37 లక్షల మందికి జీరో బిల్లులు అన్నారు. మహబూబ్ నగర్‌లో ఎన్నికల కోడ్ వల్ల 200 యూనిట్ అందుబాటులోకి రాలేదన్నారు. మూడు నెలల్లో ముపై వేళా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతికి అడ్డాగా ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రగతి భవన్ నిషేధిత ప్రాంతంగా ఉండేదన్నారు. ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు.

కేంద్రంతో పంతానికి పోవద్దని నిర్ణయం

సెక్రటేరియట్ మీదేనని ఓపెన్ చేశామన్నారు. ధర్నా చౌక్‌ని ఓపెన్ చేశాం.. బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నా చేసుకునే వీలు కల్పించామన్నారు. మార్పు మొదలయ్యింది.. మారుమూల గ్రామాలకు చేరుతుందన్నారు. 100 రోజుల్లో తెలంగాణ భాగస్వామ్యం ఉన్న అందరిని సచివాలయం రప్పించామన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు కూడా మెరుగు పరిచామని తెలిపారు. ఢిల్లీలో భవనాల పంపకాలు కూడా పూర్తి చేశామన్నారు. కేంద్రంతో పంతానికి పోవద్దని నిర్ణయం.. పంథానికి పోతే రాష్ట్రానికి నష్టమని తెలిపారు. అందుకే సయోధ్యతో పని చేయాలని మా విధానం అన్నారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వంతో కలిసి పని చేయాలి అనుకున్నామన్నారు.

మోడీ, ఈడీ ఒకేసారి వచ్చారు..

కవిత ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేస్తుంటే.. ఇంటికి తండ్రిగా రావాలి కదా? అని ప్రశ్నించారు. తండ్రిగా కాకుండా పార్టీ అధ్యక్షుడుగా నైనా వెళ్ళాలి కదా? అని ప్రశ్నించారు. ఎప్పుడు మొదట ఈడీ.. తర్వాత మోడీ రావాలి, కానీ నిన్న మోడీ.. ఈడీ ఒక్కటే సారి వచ్చారని తెలిపారు. చీఫ్ పొలిటికల్ పాలిటిక్స్ చేస్తున్నారు మోడీ, కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ.. తెలంగాణ హామీలు ఎందుకు అమలు చేయలేదు? కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి బీజేపీ.. బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నారని తెలిపారు. కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? నాటకం కాకుంటే అంటూ మండిపడ్డారు. కవిత అరెస్ట్ మోడీ కూడా ఎందుకు ప్రస్తావన చేయలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్.. కవిత అరెస్ట్ ని ఖండించలేడు.. మోడీ కనీసం స్పందించలేదని అన్నారు. ఆ ఇద్దరి విధానం తర్వాత ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ముందు అరెస్ట్ రెండు పార్టీల ఎత్తుగడలో భాగమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ANN TOP 10