AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శోభనం రోజున వయాగ్రా తీసుకుని శృంగారం.. వరుడి ఆటవిక చర్యలకు..

కొత్తగా వివాహమైన ఓ యువకుడు.. భార్యను ఎక్కువ సేపు సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఆటవిక చర్యకు తెగబడ్డాడు. శోభనం రోజున కామోద్దీన మాత్రలు వేసుకుని సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇది చివరకు ఆమె ప్రాణాలు పోయే స్థాయి వరకూ వెళ్లింది.

వరుడు ఆటవిక చర్యలకు శోభనం రాత్రే వధువుకు చివర రాత్రి అయ్యింది. శోభనానికి ముందు వరుడు వయాగ్రా తీసుకుని శృంగారంలో పాల్గొనడంతో తీవ్రంగా గాయపడిన వధువు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. అవగాన లేకుండా, అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన యువకుడు.. తన పశువాంఛలతో ఆమె చావుకు కారణమయ్యాడు. తీవ్ర రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్‌తో మూడు రోజుల పాటు బాధితురాలు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అత్యంత విషాదకర ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. హమీర్‌పూర్‌కు చెందిన ఇంజినీర్‌కు ఫిబ్రవరి 3న వివాహం జరిగింది. వధువు తీవ్ర గాయాలతో ఫిబ్రవరి 7న ఆస్పత్రిలో చేరగా.. ఫిబ్రవరి 10న చనిపోయింది. శోభనం రోజు కామోద్దీపనలు పెంచే వయాగ్రాను వేసుకున్న వరుడు.. బాధితురాలిపై రాక్షసంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ప్రయివేట్ భాగాల్లో తీవ్ర గాయాలై.. ఆపై తీవ్ర ఇన్ఫెక్షన్‌‌‌తో అస్వస్థతకు గురైంది. ఈ నెల 7న ఆమెను కాన్పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి 10న ఆమె చనిపోయింది.

సామూహిక అత్యాచారం చేసినంత దారుణంగా బాధితురాలి పరిస్థితి ఉందని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్‌ తెలిపారు. తల్లిదండ్రులు లేని ఆ యువతికి.. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె సోదరుడు వివాహాన్ని ఘనంగా జరిపించాడు. ఫిబ్రవరి 4న ఆమెను అత్తగారింటికి పంపించాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వయాగ్రా వేసుకుని, బలవంతంగా అసహజ శృంగారం చేశాడని ఆరోపించారు.

వధువు సోదరుడు మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 7న నాకు ఫోన్ చేసిన అతడు మా సోదిరిని తీసుకెళ్లిపోవాలని చెప్పాడు… మీ సోదరి ఏదో తీవ్రమైన వ్యాధితో బాధపడుతోందని ఆరోపించాడు.. ఆమె చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయలేనని అన్నాడు.. ఆమె చికిత్సకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చవుతుందని నిందితుడు అన్నాడు.. తరువాత, నేను ఆమెను కాన్పూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాను.. అక్కడ మూడు రోజుల చికిత్స తర్వాత ఆమె మరణించింది’ అని కన్నీటిపర్యంతమయ్యాడు.

ANN TOP 10