ఏసీబీ దర్యాప్తులో HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల డొంక అంతకంతకూ పెరుగుతూపోతుంది. బినామీలు భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లపై అల్రెడీ ఎంక్వయిరీ ఫ్రేమ్ పిక్సయింది. విచారణలో మరికొందరు బినామీల వ్యవహారం తెరపైకి వచ్చింది. సబ్ స్టాఫ్ను పావులుగా వాడుకున్నాడు శివబాలకృష్ణ. అటెండర్ హబీబ్, డ్రైవర్ గోపీల పేరిట భారీగా ఆస్తులు రిజిష్టర్ చేయించినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. డ్రైవర్ గోపికి శివబాలకృష్ణ గిఫ్ట్గా ఏకంగా హోండా సిటీ కారు కొనిచ్చినట్టు దర్యాప్తులో తేలింది
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల డొంక అంతకంతకూ పెరుగుతోంది. ఏసీబీ తనిఖీల్లో నోట్ల కట్టలు.. మినీ సైజ్ జువెల్లరీ షాప్ను తలపించేలా నగలు.. ఖరీదైన బ్రాండెడ్ వాచెస్.. స్మార్ట్ఫోన్లు తళుక్కుమన్నాయి. ఆయన ఆస్తులు ఆదాయానికి మించి వున్నట్టు ఆరంభంలోనే తేలింది. ఇక కూపీలాగిన కొద్దీ బినామీ బాగోతాలు క్యూ కడుతున్నాయి. బంధుమిత్రులు మాత్రమే కాదు శివబాలకృష్ణ బినామీల జాబితాలో బంట్రోతు ,కారు డ్రైవర్ పేర్లు తెరపైకి వచ్చాయి. అటెండర్ హబీబ్, కారు డ్రైవర్ గోపీల పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. లంచం వ్యవహారాల్లో హబీబ్, గోపిలది కీలక పాత్ర అని దర్యాప్తులో తేలింది. డ్రైవర్ గోపికి శివ బాలకృష్ణ హోండా సిటీ కారు గిఫ్ట్ ఇచ్చారనే ముచ్చట కూడా తెరపైకి వచ్చింది. యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమి శివబాలకృష్ణ బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్కు లేఖ కూడా రాశారు ఏసీబీ అధికారులు.
ఏసీబీ దర్యాప్తులో HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బినామీలు భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. భరత్, భరణి ఇద్దరూ శివరామకృష్ణకు మేన అల్లుళ్లు. చాలా వరకు డీల్స్లో కీలకంగా వ్యవహరించారు. ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో భరత్ ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఆ కన్సల్టెన్సీ ద్వారానే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో డీల్స్ చేసేవాడు.









