AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రయాణికులకు గుడ్ న్యూస్..! సంక్రాంతికి 32 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు వెల్లడించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి కాకినాడకు, తిరిగి సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌, హైదరాబాద్‌-కొచ్చువేలి, కాచిగూడ-భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌-గూడూరుకు 32 ప్రత్యేక హమ్‌సఫర్‌/సువిదా రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు:
హైదరాబాద్-కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు జనవరి 13వ తేదీ ఉదయం 20:15 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు 07:25 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.
కాకినాడ టౌన్-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు జనవరి 18న కాకినాడ టౌన్ నుంచి మధ్యాహ్నం 22:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 09:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-నర్సాపూర్ సువిధ ప్రత్యేక రైలు జనవరి 12వ తేదీ ఉదయం 19:15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 06:00 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
హైదరాబాద్-కొచువేలి ప్రత్యేక రైలు జనవరి 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 3, 10, 17, 24.. 31 (శనివారాలు) తేదీల్లో హైదరాబాద్ నుంచి 21.00 గంటలకు బయలుదేరి సోమవారాల్లో 03.20 గంటలకు కొచ్చువేలి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, రైలు జనవరి 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26.. ఏప్రిల్ 2 (సోమవారాలు) తేదీలలో 07:45 గంటలకు కొచ్చువేలి నుంచి బయలుదేరి మంగళవారం 14:00 గంటలు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. కాచిగూడ-భువనేశ్వర్ హమ్‌సఫర్ ప్రత్యేక రైలు జనవరి 12, 19, 26 (శుక్రవారం) తేదీలలో కాచిగూడ నుంచి 15:45 గంటలకు బయలుదేరి శనివారం మధ్యాహ్నం 13:15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

ANN TOP 10