AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో సింగరేణి ఉద్యోగాల భర్తీ

– మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
– మంత్రి సమక్షంలో ఐఎన్‌టీయూసీలో చేరిన పలువురు కార్మిక సంఘం నేతలు

సింగరేణి ఉద్యోగాల భర్తీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు ఇటీవల హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 27న ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో అనుబంధ పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సింగరేణి ఎన్నికల నిర్వహించారు. సోవారం ఉదయం ఎమ్మెల్యే కనకయ్యతో కలిసి ఐఎన్‌టీయూసీ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి సంగరేణిలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. కారుణ్య నియామకాలు నిష్పక్షపాతంగా చేపడుతామని అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. కార్మికుల వైద్య అవసరాలకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో పలువురు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు ఐఎన్‌టీయూసీలో చేరారు.

ANN TOP 10