AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు..

దేశమంతా క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా శాంటా సందడే కన్పిస్తోంది. పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. లైట్ల కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ఒడిశా లోని పూరిలో శాంటాక్లాజ్‌ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌. ఉల్లిగడ్డలతో క్రిస్మస్‌ తాతయ్యను అందంగా అలంకరించి తన సత్తాను మరోసారి చాటుకున్నారు. పూరి బీచ్‌లో ఆనియన్‌ సైకతశిల్పం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు సుదర్శన్‌ పట్నాయక్‌ . వరల్డ్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ సైకత శిల్పం రికార్డును సొంతం చేసుకుంది. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలన్న థీమతో ఈ సైకత శిల్పాన్ని క్రిస్మస్‌ సందర్భంగా రూపొందిచనట్టు తెలిపారు సుదర్శన్‌ పట్నాయక్‌.

కేరళలోని అన్ని చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. కొచ్చిలో కలర్‌ఫుల్‌ సీన్లు కన్పిస్తున్నాయి. ఏసు పుట్టిన రోజును వినూత్నరీతిన జరుపుకుంటున్నారు జనం . శ్రీనగర్‌ లోని ఫ్యామిలీ క్యాథలిక్‌ చర్చిని కూడా అందంగా అలంకరించారు. జమ్ములో కూడా చర్చిల్లో సందడే సందడి కన్పిస్తోంది. చిన్నా పెద్దా తేఉడా లేకుండా వందలాదిమంది ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కోల్‌కతా లోని చర్చిల్లో భారీ రష్‌ కన్పిస్తోంది. వందలాదిమంది జీసస్‌ను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. లక్నో , ఢిల్లీతో పాటు దేశంలో ఎక్కడ చూసినా క్రిస్మస్‌ శోభ కన్పిస్తోంది. వీథులను అందంగా అలంకరించారు.

ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ముఖ్యనేతల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ANN TOP 10