AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది.. మంత్రి కేటీఆర్

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అటు అభ్యర్థుల్లో.. ఇటు ఆయా పార్టీల క్యాడర్‌లో ఉత్కంఠ నెలకొంది. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు.. అంతేకాకుండా పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా మారాయి.. ఎక్కడ ప్రతికూలంగా మారాయంటూ బేరీజు వేసుకుంటున్నారు. ఇంకా ఎగ్జిట్ పోల్స్ పల్స్ ను చూస్తూ.. అనుచరులతో విశ్లేషణ జరుపుతున్నారు.

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. చాలాకాలం తర్వాత నిన్న రాత్రి మంచి నిద్రపోయానంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో అతిశయోక్తులున్నాయి.. కౌంటింగ్‌లో తమకు మంచి ఫలితాలు వస్తాయంటూ కేటీఆర్ వివరించారు. తెలంగాణ కేసీఆర్ తోనే ఉందంటూ మరోసారి.. కేటీఆర్ ఎక్స్‌లో కీలక మెస్సెజ్ ను షేర్ చేశారు. ‘‘చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది.. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోలేదు.. ’’.. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

ANN TOP 10