AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో అభ్యర్థిని మార్చిన బీఆర్ఎస్.. బరిలోకి ‘విజేయుడు’

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. అందరికంటే ముందుగా గెలుపుగుర్రాలను ప్రకటించిన బీఆర్ఎస్.. నామినేషన్లకు మరో మూడు రోజులే సమయం ఉండటంతో పెండింగ్‌లో ఉన్న రెండు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేసింది. అయితే.. జాబితా ప్రకటించిన తర్వాత మల్కాజిగిరి స్థానాన్ని మర్చగా.. ఇప్పుడు మరో స్థానంలోని అభ్యర్థిని కూడా మార్చేసింది. అయితే.. మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు ఖరారు చేయగా ఆయన తన కుమారునికి టికెట్ డిమాండ్ చేస్తూ.. అధిష్ఠానంపై ముఖ్యంగా హరీశ్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం కారు దిగి హస్తంతో దోస్తీ కట్టటంతో.. ఆ స్థానం నుంచి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అలంపూర్ అభ్యర్థిని కూడా మర్చింది బీఆర్ఎస్ అధిష్ఠానం.

షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి వరుసగా బీ ఫామ్‌లు ఇస్తోన్న బీఆర్ఎస్.. కొంత మందిని హోల్డ్‌లో పెడుతూ వస్తోంది. దీంతో.. ఓవైపు ప్రచారంతో బిజీబిజీగా ఉంటున్నా.. అధిష్ఠానం ఎప్పుడు ఎవరిని మార్చుతుందోనన్న టెన్షన్‌తోనే ఉన్నారు అభ్యర్థులు. కాగా.. ఇప్పుడు అలంపూర్ అభ్యర్థి అయిన.. అబ్రహంను తప్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్‌.. అందరికి బీ ఫామ్ ఇస్తూ ఆయనకు మాత్రం ఇవ్వకపోవటంతో.. సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో.. ఆ అనుమానాలను నిజం చేస్తూ.. ఈరోజు అబ్రహంను తప్పించి.. అలంపూర్ నుంచి విజేయున్ని బరిలోకి దించుతోంది. ఈమేరకు విజేయునికి కేటీఆర్ బీ ఫామ్ కూడా ఇచ్చారు.

అయితే అబ్రహంపై అలంపూర్ నియోజకవర్గంలో మొదటి నుంచి వ్యతిరేకత రావటం.. దానికి తోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి వర్గం కూడా అభ్యంతరం తెలిపింది. అబ్రహంను మార్చాల్సిందేనని పెద్ద ఎత్తున డిమాండ్‌ రావటంతో.. అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడిని బరిలో దింపాలని నిర్ణయించింది. విజేయుడికి బీ పాం ఇవ్వటంతో.. మొత్తం 119 నియోజకవర్గాల అభ్యర్థులకు బీఆర్ఎస్ అధిష్ఠానం బీ ఫాంలు ఇచ్చినట్టయింది.

ANN TOP 10