తనతో కలిసి మంత్రి కేటీఆర్.. రాజాకార్స్ ఫైల్స్ సినిమా చూడటానికి రావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ కోరారు. మంత్రి కేటీఆర్కు నిజాం పాలన గురించిన చరిత్ర తెలియదన్నారు. తన తండ్రి కేసీఆర్ను అడిగి కేటీఆర్.. మీర్ ఉస్బాన్ అలీ ఖాన్ అరాచకాల గురించి తెలుసుకోవాలన్నారు. రజాకార్ల ఫైల్స్ చూసిన తర్వాతనే మంత్రి కేటీఆర్ మాట్లాడాలన్నారు. బీజేపీ నేతలు జోకర్లు కాదని హీరోలని రాజాసింగ్ పేర్కొన్నారు.









