AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ధరణి పోర్టల్‌తో సీఎం కేసీఆర్ రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మెదక్‌లో ప్రజాశాంతి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్, బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు.

ప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి. బీఆర్ఎస్ భూస్థాపితం కావాలని గద్దర్ కోరుకున్నారు. ప్రజశాంతి ప్రభుత్వం ఏర్పాటైతే రూ.6 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తా. మైనంపల్లి అవినీతి అంతా దేవుడు క్షమిస్తాడు. అంబేద్కర్, గద్దర్, అమరవీరుల ఆశయాలు నెరవేర్చే సత్తా ప్రజా శాంతి పార్టీకి ఉంది. కేసీఆర్ ముక్త్ తెలంగాణ, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ, బీజేపీ ముక్త్ తెలంగాణ కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10 టికెట్లు జర్నలిస్టులకు ఇస్తా.. మోదీకి ఇవి లాస్ట్ ఎన్నికలు. ఈవీఎంలు వద్దు. బ్యాలెట్లు కావాలని సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తున్నాను. ఎంఐఎంకు చెందిన 7 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తాం. జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతానంటే నేనే ఆపాను. కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ చూస్తోంది. బీజేపీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. బీజేపీకి బీ పార్టీ బీఆర్ఎస్.. అని కేఏ పాల్ అన్నారు.

ANN TOP 10