AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.99.999 వరకు రుణమాఫీ క్లియర్‌!

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇచ్చిన హామీ మేరకు రూ.99.999 వరకు రుణాన్ని మాఫీ చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ నెల 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌.. ఆగస్టు 3 నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, సంబంధిత అధికారులను ఆదేశించారు.

రైతులకు రుణమాఫీపై ముఖ్యమంత్రి హామీని 100 శాతం నెరవేర్చేలా క్రియశీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఇప్పటికే రైతు రుణమాఫీపై ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌.. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగానే..రాష్ట్ర రైతాంగానికి శుభవార్తనందించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసింది సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం. పంద్రాగస్టుకు ఒకరోజు ముందుగానే.. ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ నెల 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌.. ఆగస్టు 3 నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, సంబంధిత అధికారులను ఆదేశించారు.

అయితే, సీఎం కేసీఆర్ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసినందుకు తెలంగాణలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఉత్తర్వులతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండగకు ముందు రోజు శుభవార్త చెప్పడంతో సీఎం కేసీఆర్ కు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు.

ANN TOP 10