కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
వేడుకల్లో పాల్గొన్న కంది శ్రీనన్న
ఆదిలాబాద్: జిల్లాలో మొహరం పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జైనథ్, బేల మండలాలోని పలు గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలలోని హస్సేన్ హుస్సేన్ ఆలయాలలో సవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి గుండం చుట్టూ తిరిగారు. మతసామరస్యానికి ప్రతీకైన మొహర్రం వేడుకలలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని కంది ఎనివాస రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్,షకీల్, గేడం అశోక్, సమీ ఉల్లా ఖాన్, లస్మన్న, షేక్ షహీద్, అస్బాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.











