AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓర్ఆర్ఆర్‌పై వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇక అన్నీ లైన్లు ఓపెన్

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు అధికారులు గుడ్‌న్యూస్ అందించారు. భారీ వర్షాల వల్ల రోడ్డుపై నీళ్లు నిలిచిపోవడంతో ఓఆర్ఆర్‌పై 2,7 ఎగ్జిట్ లైన్లను ఇటీవల మూసివేశారు. దాదాపు రెండు రోజుల పాటు రోడ్డును మూసివేయగా.. ఇప్పుడు మళ్లీ ప్రయాణికుల కోసం తెరిచారు. ఎక్కడికక్కడ రోడ్డుపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు వెళ్లడానికి కష్టంగా మారింది. ఓర్ఆర్‌ఆర్‌పై వేగంగా వెహికల్స్ వెళుతూ ఉంటాయి. నీళ్లు నిలిచిపోయి రోడ్డు తడిగా ఉండటం వల్ల వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే 2,7 ఎగ్జిట్ లైన్లను మూసివేసినట్లు ఇటీవల అధికారులు తెలిపారు.

ఇప్పుడు వర్షాలు తగ్గడం, నీటిని బయటకు పంపించడంతో ఓఆర్ఆర్‌ను ఎప్పటిలాగే పూర్తిగా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో పాటు అన్ని లైన్లను వాహనదారులకు పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. తాత్కాలికంగా ఇటీవల 2,7 ఎగ్జిట్ పాయింట్లను మూసివేయడంతో ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. ఇప్పుడు తిరిగి తెరుచుకోవడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని అధికారులు చెబుతున్నారు.

ANN TOP 10