AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘కచిడి’ చేప.. వేలంలో కళ్లు చెదిరే ధర!

మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప.. వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. అనేక వ్యాధులను నయం చేసేందుకు తయారుచేసే ఔషధాల్లో ఉపయోగించే ‘కచిడి’ చేప.. కాకినాడ కుంభాభిషేకం రేవులో మత్స్యకారులు వలకి చిక్కింది. వెంటనే ఈ చేపను వేలం వేయగా.. దాదాపు రూ.3.30 లక్షలు పలికింది. ఈ కచిడి చేప బరువు 25 కిలోల దాకా ఉంది.

కచిడి చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో ఎక్కువగా ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తుంటారని పేర్కొంటున్నారు. అందుకే ఈ చేపకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

ANN TOP 10