ఐఐటీ ఢిల్లీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తర్ప్రదేశ్లోని బరేలీకి చెందిన ఆయుష్ అనే విద్యార్థి ఐఐటీ ఢిల్లీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ఆ విద్యార్థి క్యాంపస్లోని ఉదయగిరి హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు డిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఏడాదిలో దేశంలోని ఐఐటీల్లో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి నెలలో ఐఐటీ మద్రాస్లో ఒకరు, ఐఐటీ బాంబేలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మార్చి నెలలో ఐఐటీ మద్రాస్లో పశ్చిమ బెంగాల్కు చెందిన పీహెచ్డీ విద్యార్థి, ఏప్రిల్ నెలలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా దిల్లీ ఐఐటీలో బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.









