AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ సభకు కీలక నేతల డుమ్మా.. అందుకేనా?

కనిపించని వివేక్, విజయశాంతి, చంద్రశేఖర్‌
ఎడమొఖం, పెడమొఖంగానే ఈటల, బండి
బీజేపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముగ్గురు కీలక నేతలు డుమ్మా కొట్టారు. అందులో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ప్రధాని సభలో ఎక్కడా కనిపించలేదు. వీరు త్వరలో పార్టీ మారబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడాన్ని ఆమె బాహాటంగానే ఖండించారు. బండిని తప్పించడం, ఈటలకు ప్రాధాన్యత ఇవ్వటంతో వివేక్‌ కూడా కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

మాజీ మంత్రి చంద్రశేఖర్‌ కూడా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే బాధలో ఉన్నారు. త్వరలో వీరిలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోబోతున్నారనీ, ఒకరు కారెక్కబోతున్నారనే ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతున్నది. ప్రధానమంత్రి సభకు హాజరుకాకపోవడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది.
మరోవైపు జిల్లాస్థాయి నేతల్లో కూడా కొందరు గైర్హాజరు అయినట్టు ప్రచారం జరుగుతున్నది. కిషన్‌రెడ్డి అధ్యక్ష పీఠం ఎక్కాక అందర్నీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తారనీ, ఇక గ్రూపు తగాదాలుండవని భావించిన అధిష్టానానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే.

ప్రక్షాళనలో భాగంగా కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినా, పార్టీ వీడకుండా ఈటలకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ పదవి కట్టబెట్టినాం చివరి నిమిషం వరకూ కాంగ్రెస్‌ గూటికి చేరకుండా అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రమోట్‌ చేసినా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడంలేదు. ఆధిపత్యపోరు రగులుతూనే ఉన్నది. మేమంతా ఒక్కతాటిపై ఉన్నామని కిషన్‌రెడ్డి, ఈటల చెబుతున్నాంకిషన్‌రెడ్డి తమ గురువు అని బండి ప్రబోధిస్తున్నా లోలోన అంతర్గత పోరు నడుస్తూనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఈటల రాజేందర్, బండి సంజయ్‌ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. రఘునందన్‌ రావుదీ అదే పరిస్థితి.

ANN TOP 10