తెలంగాణలో ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానున్నది. జూలై 5 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, 28 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 28 నుంచి జూలై 8 వరకు వెబ్ఆప్షన్ల ఎంపిక, 12న సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్లో 1,56,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు.









