AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన దినసరి కూలీ..

అకౌంట్లో రూ.100 కోట్లు జమ.. నోటీసులు పంపిన అధికారులు
ఓ దిన సరి కూలి రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్​అకౌంట్‌కు ఉన్నపలంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. బెంగాల్ దేగంగాలోని వాసుదేవ్​పుర్‌కు చెందిన మహ్మద్ నసీరుల్లా (26) ఓ వ్యవసాయ కూలీ. అతడికి తల్లిదండ్రులతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నసీరుల్లా కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.

ఐతే నసీరుల్లాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి అప్పుడప్పుడు నసీరుల్లా లావాదేవీలు జరిపేవాడు. ఐతే వేల డబ్బును ఒక్కసారి కూడా డిపాజిట్‌ చేయడంగానీ, విత్‌డ్రా చేయడం గానీ జరగలేదు. దినసరి కూలి అయిన నసీరుల్లా అకౌంట్‌లో రూ.17 మాత్రమే ఉన్నాయి.

ఐతే తాజాగా తన అకౌంట్‌లో రూ.100 కోట్లు జమ అయినట్లు నసీరుల్లా గుర్తించాడు. దీంతో ఆయనకు జంగీపుర్ సైబర్ క్రైమ్​ పోలీసులు నోటీసులు పంపారు. మే 30లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో భయభ్రాంతులకు గురైన నసీరుల్లా ఆ డబ్బులు తన అకౌంట్‌కు ఎలా వచ్చి చేరిందో తెలియక తలపట్టుకున్నాడు. దీంతో బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో బ్యాంకు అధికారులు నసీరుల్లా బ్యాంక్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10