”నేనెంత ఎదవనో నాకే తెలీదు” అంటూ మాటల తూటాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన పూరి గత కొంతకాలంగా వరుస ప్లాపులతో డీలా పడ్డ సంగతి తెల్సిందే.అయితే ఈ సారి సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తానంటూ పట్టాలెక్కించిన సినిమా ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’.కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నుండి అఫీషియల్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్.
టీజర్ ని పరిశీలిస్తే “ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడితే నేనెందుకు వదులుతా” అంటూ విజయ్ సేతుపతి తనదైన మార్క్ బేస్ వాయిస్తో చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూరి జగన్నాథ్ మార్క్ రగ్గడ్ క్యారెక్టరైజేషన్, విజయ్ సేతుపతి ఇంటెన్స్ యాక్టింగ్ కలగలిసి ఈ టీజర్లో గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. మురికివాడల నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ రివెంజ్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టీజర్ కట్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
ఆడియన్స్కు పూనకాలు తెప్పిస్తున్న టీజర్
గతంలో పూరి జగన్నాథ్ ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి చిత్రాలతో హీరోల క్యారెక్టరైజేషన్లను పీక్స్లో చూపించారు. అయితే ఈసారి ఆయన విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ యాక్టర్ను ఎంచుకోవడం ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి భిన్నమైన ఫలితాల తర్వాత పూరి జగన్నాథ్ పక్కా స్క్రిప్ట్తో, పూర్తి స్థాయి యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
టీజర్లో వినిపించే “అరేయ్ దొంగ నాకొడుకా” అనే పవర్ఫుల్ వాయిస్ ఓవర్ మరియు స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్సులు మాస్ ఆడియన్స్కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.








