AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెదక్ కలెక్టరేట్ మెట్లెక్కిన మత్స్యకారులు..! ఎడినీ సస్పెండ్ చేయాలని డిమాండ్..!

అల్లదుర్గం మండలం గడిపెద్దాపూర్ మత్స్యకార సొసైటీకి ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను దిక్కరించిన మెదక్ జిల్లా మాత్స్యశాఖ ఎడినీ అందుకు సహకరించిన ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణీలో వినతిపత్రం సమర్పించారు. గడ్డి పెద్దాపూర్ సొసైటీలో కన్సాన్పల్లి గ్రామస్తులను సభ్యులుగా చేర్చుకోవాలని ఏడీ మల్లేశంను కొరగా గ్రామంలోని నిరుద్యోగ యువత సభ్యులుగా చేర్చుకోవాలని సోసైటీ తిర్మాణం చేసిందని తెలిపారు.

 

మత్స్యశాఖ ఏడి..

సంగారెడ్డి జిల్లా కన్సాన్పల్లి గ్రామంలో 20 శాతం మాత్రమే చెరువు శిఖముండగా అధికారులను తప్పుదోవ పట్టించి ఉన్నతాధికారులను తప్పుగా పట్టిస్తున్నారనీ ఆరోపించారు. హైకోర్టు గడిపెద్దాపూర్ సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన మత్స్యశాఖ ఏడి వ్యతిరేకంగా వ్యవహరించి డబ్బులు తీసుకుని తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. క్షేత్రస్థాయిలో గడిపెద్దపూర్ సొసైటీ సభ్యులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధ్యక్షులు పుట్టి నారాయణ, నాగయ్య, పురుషోత్తం, అల్లాదుర్గం నియోజకవర్గం జలసాధన సమితి అధ్యక్షులు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10