AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాయచోటి విషయంలో సీఎం చంద్రబాబు బాధపడ్డారు: తప్పనిసరి పరిస్థితుల్లోనే మదనపల్లెకు జిల్లా కేంద్రం!

వైజ్ఞానిక విభజన కోసం కఠిన నిర్ణయం అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించి, మదనపల్లెను ఖరారు చేయడం వెనుక ఉన్న కారణాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో బాధపడ్డారని, అయితే జిల్లా ఉనికిని కాపాడేందుకు ఇది అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అశాస్త్రీయ జిల్లాల విభజన వల్లే నేడు ఇటువంటి గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, ఆ అసంబద్ధ నిర్ణయాల ఫలితాన్ని ఇప్పుడు తాము సరిదిద్దాల్సి వస్తోందని ఆయన విమర్శించారు.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన – సీఎం ఓదార్పు జిల్లా కేంద్రం హోదాను రాయచోటి కోల్పోవడంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. కేబినెట్ సమావేశంలో ఆయన భావోద్వేగానికి లోనవగా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయన్ను ఓదార్చి భరోసా ఇచ్చారు. రాజంపేట ప్రజలు కడపలో, రైల్వే కోడూరు వాసులు తిరుపతిలో కలవాలని కోరుతుండటంతో.. జిల్లా సమగ్రతను కాపాడటానికి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంగా మదనపల్లెను ఎంపిక చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు.

ప్రజాభిప్రాయానికి పెద్దపీట జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం మరికొన్ని మార్పులు కూడా చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గూడూరును తిరిగి నెల్లూరులో, రాజంపేటను కడపలో విలీనం చేయడం ప్రజల కోరిక మేరకే జరిగిందన్నారు. రాయచోటి విషయంలో రాంప్రసాద్ రెడ్డి పడుతున్న బాధలో అర్థముందని, అయితే భవిష్యత్తులో ఆ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆయనకు మంచి పేరు తెచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అనగాని ధీమా వ్యక్తం చేశారు. జనవరి 1 నుండి ఈ కొత్త మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ANN TOP 10