‘RRR’ మూవీతో తారక్ రేంజ్ ఎలా పెరిగిందో చెప్పక్కర్లేదు. ఇక చిరవగా ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా. బాలీవుడ్ ‘వార్ 2’ లో కూడా నటిస్తున్నాడు ఈ మూవీ ఆగస్ట్లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా, ‘దేవర 2’లకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సినీ పితామహుడిగా పరిశ్రమ కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. ఈ ప్రాజెక్టు వెనుక రాజమౌళి, కార్తికేయ, వరుణ్ గుప్తా ప్రమేయం కూడా ఉందని టాక్. అంతే కాదు..
ఇపటికే స్ట్రిప్ట్ కూడా సిద్ధం కాగా, అది విన్న జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయి ఓకే చేశారట. అయితే భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందటనే ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే సినిమా అనౌన్స్ చేయగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్ కక్కర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, త్వరలో వెల్లడిస్తామని అప్పుడు చెప్పగా, ఆ తర్వాత దాని నోరు విప్పింది లేదు. కాని ఇప్పుడు ఉన్నట్టుండి ఇందులో ఎన్టీఆర్ నటిస్తారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చాలా పెద్దది. అలాంటి కథలను కచ్చితంగా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు అయితేనే ఈ ప్రాజెక్ట్ భాగా చేయగలరు. మరి ఇండియన్ సినిమా పుట్టుక, పెరుగుదలను తెలియజేస్తూ.. సినిమాలకి బీజం ఎక్కడ పడింది, ఎదిగే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది అనేది చిత్రంలో చూపించనున్నారట.