రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో అరుదైన రంగు రాళ్లు లభ్యం కావటం చర్చనీయాంశంగా మారింది. మండల శివారులోని చిట్యాల గుట్ట ప్రాంతంలో ఓ వ్యక్తికి మూడు రంగురాళ్లు దొరికాయి. ఆ రాళ్లు ఒక్కోటి కిలో, అర కిలోకు పైగానే ఉన్నాయి. విలువైన వజ్రాల మాదిరి మెరుస్తున్నాయి. ప్రస్తుతం ఆ రాళ్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవి ఖరీదైన వజ్రాలు అంటూ స్థానికంగా ప్రచారం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన పిట్ల రాజేశం స్థానికంగా హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. శుక్రవారం (నవంబర్ 1) వీర్నపల్లి శివారులోని చిట్యాల గుట్ట ప్రాంతానికి సీతాఫలాల కోసం వెళ్లాడు. చెట్టుకు సీతాఫలాలు కోస్తుండగా.. అక్కడ మెరుస్తున్న మూడు రంగురాళ్లు రాజేశంకు కనిపించాయి. చూడ్డానికి చాలా అరుదుగా మెరుస్తూ కనిపించటంతో ఒకింత ఆశ్చర్యానికి గుర్యయాడు. వాటిని పట్టుకొని పరిశీలించి చాలా అరుదుగా కనిపించటంతో సంచిలో వేసుకొని ఇంటికి వచ్చాడు.