(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
రాజ్యసభ సభ్యత్వానికి బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు గురువారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిసిన ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను ఆమోదించాలని ఆయన్ను కోరారు. కాగా బుధవారం ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కేకే రాజీనామాతో రాజ్యసభ ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీకి దక్కనుంది.









