హైదరాబాద్: ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పాలనాపరమైన, కీలకమైన అధికారుల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలల రావుని ప్రభుత్వం నియమించింది. నేటి వరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది.
కాగా ఇప్పటివరకు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. వారం రోజుల పాటు ఆయన సెలవుపై వెళ్లారు. చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లకముందే ధర్మారెడ్డికి ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. కాగా నాలుగు సంవత్సరాలు నుంచి తిరుమలలో ధర్మారెడ్డి చెప్పిందే వేదంగా నడిచిందనే విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. వైసీపీతో అంట కాగారనే ఆరోపణలు ఆయనపై అనేకం ఉన్నాయి.









