ఢిల్లీలో రాధాకృష్ణన్ను కలిసిన బాబు
చంద్రబాబును అభినందించిన గవర్నర్
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు. ఢిల్లీలో మర్యాదఫూర్వకుంగా గవర్నర్ను కలిశారు. ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ కూటమి అభ్యర్థులు 164 చోట్ల గెలుపొందారు. ఇక ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఢిల్లీలో జరిగిన కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లారు. సమావేశంలో పాల్గొని మోదీని మరోసారి ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు.
ఆ తర్వాత చంద్రబాబు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి విజయవాడుకు బయలుదేరే ప్రోగ్రామ్లో లాస్ట్మినిట్లో స్వల్ప మార్పులు జరిగాయి. నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలా షెడ్యూలు రూపొందినా.. అక్కడి తెలంగాణ భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్ ఉన్నట్లు చంద్రబాబుకు తెలిసింది. దీంతో ఆయన తన షెడ్యూల్ మార్చుకొని..శబరి బ్లాక్కు వెళ్లి రాధాకృష్ణన్ను కలుసుకున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన చంద్రబాబును గవర్నర్ అభినందించారు. ఇద్దరి మధ్య సుమారు 30 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు మర్యాదపూర్వకంగా గవర్నర్తో భేటీ అయినట్లు తెలిపారు.









