(అమ్మన్యూస్, హైదరాబాద్):
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను పలువురు పార్టీ ఎమ్మెల్యేలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ను కలిసిన వారిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.









