ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు సోమవారం సమన్లు జారీ అయ్యాయి. ఈ మేరకు మే 01న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు అంటూ అమిత్ షా మాట్లాడుతున్న ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ రెడీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లతో పాటు ఆ వీడియోను షేర్ చేస్తుంది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని బీజేపీ పిటిషన్లో పేర్కొంది. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.









