AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదు’

బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనుములకు, ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. చిత్రపురి సొసైటీలో జరిగిన అవినీతికి సీఎంకు సంబంధం ఏమిటని, ఎప్పుడైనా రేవంత్ సోదరులో మహేంద్ర రెడ్డి అనే పేరు విన్నారా..? అని ప్రశ్నించారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. తప్పకుండా వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నిజంగా తప్పు చేస్తే ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని తెలిపారు. కానీ, అనవసరంగా కావాలని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే.. గతంలో మీ ప్రభుత్వం ఉంది ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో మీడియాను, సోషల్ మీడియాను కేసీఆర్ ఏ విధంగా అణిచివేశారో అందరికి తెలుసన్నారు. హుజురాబాద్‌తో తన ఫోన్ తీసుకొని కేసు పెట్టింది మార్చిపోయారని గుర్తు చేశారు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరిన మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన సంఘటన అప్పుడే మర్చిపోయారా అని నిలదీశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంట్లోకి వచ్చి అరెస్టులు చేసిన సంఘటనలు మర్చిపోయారా అంటూ ఫైర్ అయ్యారు. తను మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు చేస్తే.. ఒక గాడిదకు ఫోటో వేస్తే గడిగా దొంగతనం జరిగిందని సుమోటోగా కేసులు పెట్టారని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా ఒక అధికారి ఇంటిపై రూమ్‌లో లాక్ చేసి పెట్టారని తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వమని, వాళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాదన్నారు. ఆధారాలతో రండని, ఊరికే బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌లుగా ఉన్నామని, ఏమైనా మాట్లాడొచ్చు అంటే కుదరదని వ్యాఖ్యానించారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదని, తనపని తను చేసుకుపోతుందన్నారు. భజనలు చేయడం మానుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా తమ సీఎంపై లేనిపోని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టమని, క్రిశాంక్ మీరు ఎప్పుడు మాలగా చెప్పలేదని పేర్కొన్నారు. మీడియా ముందు చెప్తున్నాను ఆధారాలు తీసుకుని అమరవీరుల స్థూపం వద్దకు రండని సవాల్ విసిరారు. డీజీపీ ఆఫీస్‌కు వెళ్దాం.. ఎవరు తప్పు చేసిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. క్రిశాంక్ కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఇద్దరం కలిసి ఉద్యమాలు చేస్తే ఇద్దరిపై కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. అవాస్తవాలు చెప్పడం మానుకోండన్నారు. మీకు కావాల్సిన ఎమ్మెల్యే టికెట్ కోసం ఇలా తమపై అవస్తవాలు మాట్లాడడం మానుకోండని బల్మూరి వెంకట్ మండిపడ్డారు.

ANN TOP 10