AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో రెండు లోక్‌స‌భ నేత‌ల‌లో కేసీఆర్ భేటీ

మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్ నేతలతో ఇవాళ కేసీఆర్ భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ముఖ్యంగా నాగర్‌ కర్నూల్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు కేసీఆర్.

కాగా, నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ ,ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవితకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

ANN TOP 10